Friday, April 26, 2024
Friday, April 26, 2024

చెన్నై సూపర్‌ కింగ్స్‌కు షాక్‌!

చెన్నై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 16వ సీజన్‌ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుండగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంఛైజీకి షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ పేసర్‌ కైలీ జేమీసన్‌ టోర్నీకి దూరం కాను న్నాడు. వెన్నెముక గాయంతో బాధపడుతున్న ఈ న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ శస్త్రచికిత్స చేయించుకో నున్నాడు. దాంతో, అతను నాలుగు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని ఈ సీజన్‌లో ఈ ఫాస్ట్‌ బౌలర్‌ ఆడడం దాదాపు అసా ధ్యం. 2023 ఐపీఎల్‌లో తమ జట్టు కప్పు గెలవ డంలో జేమీసన్‌ కీలకం అవుతాడనుకున్న సూపర్‌ కింగ్స్‌కు నిజంగానే ఎదురు దెబ్బ. ఇప్పటికే అతను స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌కు దూరమయ్యాడు. లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టే ఈ పొడగరి ఆల్‌రౌండర్‌ కోసం 2021 ఐపీఎల్‌ మినీ వేలంలో ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు రూ.15 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే ఆ సీజన్‌లో అతను పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో, జేమీసన్‌ను ఆర్సీబీ రిలీవ్‌ చేసింది. 2023 వేలంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ. కోటికి ఈ ఆల్‌రౌండర్‌ను కొనుగోలు చేసింది. మార్చి 31న ఐపీఎల్‌ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండిరగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ తలపడనున్నాయి.
డబ్ల్యూటీసీ ఫైనల్లో…ఆరడుగుల ఆరు అంగుళాల పొడవు ఉండే జేమిసన్‌ కివీస్‌ బౌలింగ్‌ లైనప్‌లో చాలా కీలకం. రెండేళ్ల క్రితం జరిగిన ఐసీసీ తొలిసారిగా నిర్వహించిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ పోరులో న్యూజిలాండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో ఇతను ఏడు వికెట్లు తీశాడు. దాంతో, ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఇప్పటివరకూ 16 టెస్టులు ఆడిన జేమీసన్‌ 19.45 సగటుతో 72 వికెట్లు పడగొట్టాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img