పృథ్వీషాపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు
అతడు మామూలు ఆటగాడు కాదని..ఈ గ్రహం వాడు అసలే కాదని టీమిండియా ఓపెనర్ పృథ్వీషాపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు.అతడికి తాను చాలా పెద్ద ఫ్యాన్నని చెప్పారు. శ్రీలంకతో నిన్న జరిగిన తొలి వన్డేలో పృథ్వీషా ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించాడు.24 బంతుల్లోనే 43 పరుగులు చేసి అవుటయ్యాడు.అతడి అద్భుత ప్రదర్శనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ..‘‘పృథ్వీషా మరో గ్రహం నుంచి వచ్చాడు. నేను అతడికి పెద్ద ఫ్యాన్ను. అతడి లాంటి బ్యాట్స్మన్ దేశంలోనే ఎవరూ లేరు’’ అని పేర్కొన్నాడు.