అధ్యక్షులు మాల గుండ్ల మల్లికార్జున
విశాలాంధ్ర -ధర్మవరం : మంచి చదువు భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తుందని కురుబ కళ్యాణ మండపం అధ్యక్షులు మాలగుండ్ల మల్లికార్జున, ప్రధాన కార్యదర్శి కప్పల బలరాముడు తెలిపారు. ఈ సందర్భంగా యశోదమ్మ, వకీలు పెద్దయ్య కురుబ కళ్యాణ మండపము నందు అధ్యక్షులు మాలగుండ్ల మల్లికార్జున ఆద్వర్యంలో కురుబ కుల విద్యార్ధిణీ, విద్యార్ధులకు ప్రతిభా అవార్డుల పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమము నందు 10 వ తరగతిలో 500 కు పైగా మార్కులు సాధించిన విద్యార్ధులకు బహుమతులు ప్రదానం చేశా రు. 10 వ తరగతిలో కుమారి బిల్లే యశస్విని 588 మార్కులు, కుమారి గొంగటి ధనలక్ష్మి 586 మార్కులు, కుమారి బిల్లే అమృత 582 మార్కులు సాధించిన విద్యార్ధులకు ప్రథమ బహుమతి రూ.5000/-, మొమెంటో, రెండవ బహుమతి రూ.3000/- , మొమెంటో, మూడవ బహుమతి రూ.2000/- , మొమెంటో గారు అందజేశారు. అదేవిధంగా 500 కు పైగా మార్కులు సాధించిన దాదాపు 50 మంది విద్యార్ధులకు కన్సోలేషన్ బహుమతిగా రూ.1000/- తో పాటు మొమెంటోలు బహుమతి ప్రదానం కురుబ సంఘం వారు అందజేశారు. అలాగే ఇంటర్మీడియట్ నందు 984 మార్కులు సాధించిన కుమారి పసవుల ప్రీతికి ప్రధమ బహుమతి, 970 మార్కులు సాధించిన కుమారి బండి సాయి కీర్తి కి ద్వితీయ బహుమతి, 967 మార్కులు సాధించిన కుమారి కాపాడం చంద్రికా రాణికి తృతీయ బహుమతి ప్రదానం చేశారు. తదుపరి 20 మంది విద్యార్ధులకు కన్సోలేషన్ బహుమతి ప్రదానం చేయడం జరిగిందని వారు తెలిపారు. వీరితో పాటు వివిధ శాఖలలో ఉదోగాలు సాదించిన వారికి ఎంబిబిఎస్ నందు సీట్లు సాధించిన వారికి ఐఐటి నందు సీట్లు సాధించిన వారికి ఆత్మీయ సన్మానము నిర్వహించామని తెలిపారు. కురుబ విద్యార్ధులకు ప్రతి సంవత్సరం కళ్యాణ మండపము కమిటీ ప్రతిభా అవార్డు ప్రదాన కార్యక్రమము, కనకదాస జయంతి ఉత్సవాలు జరుపబడునని తెలిపారు. కార్యక్రమములో కోశాధికారి బండి ఉజ్జినప్ప, ఉపాద్యక్షులు కోటి వెంకటేష్, గవ్వల బాబు, సహాయ కార్యదర్శి బులగుండ్ల నాగార్జున, డైరెక్టర్ కె. సి. నారాయణ స్వామి, ఆకులేటి వెంకటేష్, శీరిపి రామాంజినేయులు , నారాయణ శేట్, గీరక మల్లికార్జున,గిరక మనోహర్, గిరక మురళీ, కమతం ఈశ్వరయ్య, పామాల శ్రీనివాసులు, పామాల సుధాకర్, కోటి వెంకప్ప, దేవర సత్యనారాయణ, బులగొండ్ల నాగరాజు మరికొంత మంది డైరెక్టర్స్ తో పాటు ఉద్యోగుల సంఘం అద్యక్షులు ఆకులేటి రమేష్, కోటి బాబు, కనకదాస టీచర్స్ ప్రెసిడెంట్ కాపాడం ఈశ్వరయ్య , కార్యదర్శి చంద్ర మోహన్ వీరితో పాటు దాదాపు 500 మంది కురుబలు పాల్గొని కార్యక్రమమును జయప్రదం చేశారు.