విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని మారుతీ నగర్ లో గల కంశల రామాంజనేయులు అనే చేనేత కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు స్థానికులు తెలిపిన వివరాల మేరకు వెళితే మృతుడు కూలి మగ్గం నేర్చుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడని, గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో మాట్లాడుతుండగా ఉన్నపలంగా కుప్పకూలిపోయాడు అని, చివరకు మృతి చెందాడని తెలిపారు. విషయం తెలుసుకున్న టిడిపి పట్టణ అధ్యక్షుడు పరిసే సుధాకర్, వార్డ్ టిడిపి అధ్యక్షులు గోసాల శ్రీరాములు సూర్యనారాయణలు మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మృతునికి భార్య సురేఖ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలరని తెలిపారు. ఈ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు బంధుమిత్రులు కోరుతున్నారు.