Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

12సార్లు రక్తదానం చేసిన మధుకు అభి నందన వెల్లువ

విశాలాంధ్ర ధర్మవరం:: అనంతపురానికి చెందిన రామలక్ష్మి అనే అమ్మాయికి రక్తం తక్కువ కావడంతో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో అడ్మిషన్ కావడం జరిగింది. అమ్మాయి కుటుంబ సభ్యులు ఓ పాజిటివ్ బ్లడ్ కావాలని వైద్యులకు తెలపగా, సోషల్ మీడియా ద్వారా రక్త బంధం ఆర్గనైజేషన్ సభ్యులు మధు వెనువెంటనే స్వచ్ఛందంగా అక్కడికి వెళ్లి రక్తాన్ని ఇవ్వడం జరిగింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు మధుకి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలను తెలియజేశారు. తదుపరి మధు మాట్లాడుతూ ఇప్పటికి తాను 12 సార్లు రక్తదానం చేయడం జరిగిందని. భవిష్యత్తులో కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి కచ్చితంగా రక్తదానం చేస్తామని తెలిపారు. తదుపరి రక్త బంధం ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు కన్నా వెంకటేష్ తో పాటు సభ్యులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశా రు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img