Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

విద్యార్థులకు వృత్తి విద్యపై అవగాహన సదస్సు

విశాలాంధ్ర,ఎన్ పి కుంట: మండల కేంద్రంలోని నంబులపూలకుంట వన్ సచివాలయంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులకు గురువారం వృత్తి విద్యపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు లెర్నెడ్ స్కిల్ ఫర్ లైఫ్ కార్యక్రమం ద్వారా ఇండస్ట్రియల్ సందర్శనార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు కంప్యూటర్ స్కిల్స్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. సచివాలయం నుండి లబ్ధిదారులు పొందే క్యాస్ట్, ఆదాయం ధ్రువీకరణ సర్టిఫికెట్ల నమోదు పై పిల్లలకు సచివాలయ సిబ్బంది తెలియజేశారు. విద్యార్థులకు బాల్య వివాహాల వలన వచ్చే అనర్థాలపై ఈ ఓ ఆర్ డి మనోహర్ బాబు తెలియజేశారు. కార్యక్రమంలో సచివాలయ పంచాయతీ కార్యదర్శులు రమేష్ బాబు, ముబారక్, వెల్ఫేర్ అసిస్టెంట్ గంగ, గురుకుల పాఠశాల ప్రత్యేక అధికారి రిహానా, గురుకుల పాఠశాల సిబ్బంది అలియా, అరుణ,రూపా రాణి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img