Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

గంగెద్దులవారి పల్లిలోవేరుశనగ లో పంట కోత ప్రయోగం

విశాలాంధ్ర,ఎన్ పి కుంట: మండల పరిధిలోని మేకలచెరువు పంచాయతీ గంగెద్దుల వారి పల్లి గ్రామంలోని రైతు లక్ష్మిరెడ్డి సర్వే నంబర్ 565 లోని ఒక ఎకరా విస్తీర్ణంలో జరిపిన వేరుశనగ పంట కొత ప్రయోగంను మండల వ్యవసాయ అధికారి లోకేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎకరాకు సరాసరి దిగుబడి (5×5 చదరపు అడుగుల లొ 9.900 కేజీలు)12.2 క్వింటాళ్లు వచ్చినట్లు మండల వ్యవసాయ అధికారి లోకేశ్వర్ రెడ్డి తెలిపారు. మరికొమ్మదిన్నె ,వెలిచెలమల గ్రామాలలో నిర్వహించిన పంట కోత ప్రయోగాల్లో కూడా సరాసరి దిగుబడి 14 క్వింటాళ్లు ఎకరాకు దిగుబడి వచ్చినట్లు వారు తెలిపారు., ఈ కార్యక్రమంలో ఆర్ బి కే సిబ్బంది హరి , సున్ను భాష ,రైతులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img