విశాలాంధ్ర ధర్మవరం :: బక్రీద్ పండుగను ప్రశాంతంగా పట్టణ ప్రజలు జరుపుకోవాలని వన్ టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఈ సందర్భంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో హిందూ ముస్లింలకు సమావేశాన్ని సీఐ సుబ్రహ్మణ్యం శాంతి సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రశాంతతకు మారుపేరు బక్రీద్ పండుగని అదే రీతిలో జరుపుకోవడంతోపాటు అందరి సహాయ సహకారాలు ముస్లిం సోదరులకు అందించాలని తెలిపారు. ఈద్గా మైదానికి ముస్లింలు వెళ్లేటప్పుడు పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం విశ్వహిందూ పరిషత్ అనంతపురం జిల్లా విభాగ కార్యదర్శి పులి చర్ల వేణుగోపాల్ మాట్లాడుతూ గోవు గురించి, గోహత్య నిషేధం చట్టాల గురించి తెలియజేయడం జరిగిందన్నారు. అక్రమంగా ఉన్న గోవదశాలలు వెంటనే మూసివేయాలని, గోవులను ఎక్కడ కూడా వధించకూడదని గోసంతతిని కూడా రైతుకు ఉపయోగ పడనివి ముసలి అయినవి పశువైద్యాధికారి సర్టిఫికెట్ చేసినటువంటి మాత్రమే చంపాలని వారు తెలియజేశారు.ఈ సమావేశంలో ముస్లిం సోదరులు నాగురు హుస్సేన్, రాళ్లపల్లి షరీఫ్, అత్తర్ రహీం బాషా, చాంద్ బాషా, ఖలీల్ రెహమాన్, కుల్లాయప్ప, విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.