విశాలాంధ్ర ధర్మవరం:: 2019లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ధర్మవరం నకు వచ్చినప్పుడు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పై అక్రమంగా పెట్టినటువంటి కేసులో ధర్మవరం కోర్టుకు హాజరు కావడం జరిగింది. లాయర్ల వాదోపవాదాలు విన్న తర్వాత జడ్జి మధుసూదన్ రెడ్డిని నిర్దోషిగా తీర్పును ప్రకటించారు. దీంతో జనసేన అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నాపై అక్రమంగా పెట్టే కేసులు ఎప్పుడూ కూడా విజయం సాధించవని, కోర్టు మీద విశ్వాసం ఉన్నందునే నన్ను నిర్దోషిగా తెలుపుతూ తీర్పు ఇవ్వడం బట్ట సంతోషాన్ని వ్యక్తం చేశారు.