Monday, May 20, 2024
Monday, May 20, 2024

ప్రభుత్వ సంక్షేమ పథకాలే మా విజయాన్ని చేకూర్చుతాయి.. ఎమ్మెల్యే సతీమణి సుప్రియ

విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ సంక్షేమ పథకాలే మా విజయాన్ని చేకూర్చు తాయని ఎమ్మెల్యే సతీమణి సుప్రియ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు 16 వ వార్డు, ఏడవ వార్డులలో ఇంటింటా ప్రచారం చేశారు.బలిజ కళ్యాణ మండపం వద్ద నుండి ఇంటింటికి ప్రచారాన్ని కొనసాగించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలు నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నియోజకవర్గంలో అర్హులైన వారందరికీ కూడా లబ్ధి చేకూర్చడం జరిగిందన్నారు. రాజకీయాలకు అతీతంగా కుల మతాలకతీతంగా సంక్షేమ పథకాలను అందించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి అభివృద్ధి చేస్తూ ఉంటే కొన్ని పార్టీల వారు బురద జల్లడం మానుకోవాలని తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, వేయించి ,ధర్మవరం ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని జరిపించాలని తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులు అందజేయాలని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదల యొక్క మరిన్ని సమస్యలను పరిష్కరించే దిశగా పాటుపడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 16వ వార్డు కౌన్సిలర్ కేతా లోకేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ కాచర్ల లక్ష్మి, వైస్ చైర్మన్లు వేముల జయరాం రెడ్డి, షమీం బేగం, పట్టణ వార్డు కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు పట్టణ అధ్యక్షులు, సీనియర్, జూనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img