మాదకద్రవ్యాలను నిరోధించండి
రోడ్డు నిబంధనలు పాటించాలి
జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి జి.శివప్రసాద్ యాదవ్
విశాలాంధ్ర-అనంతపురం : విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడి తమ బంగారు భవిష్యత్తు కోల్పోరాదని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి జి శివప్రసాద్ యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం అనంతపురం ప్రభుత్వ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన ప్రసంగించారు.రోడ్డు నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలని న్యాయమూర్తి కోరారు. ఈ కార్యక్రమంలో శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ కే శ్రీనివాసరావు మాట్లాడుతూ ర్యాగింగ్ నిరోధక చట్టంలోనిఅంశాలను స్థూలంగా వివరించారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భక్తవత్సలం అధ్యక్షత వహించారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ వాహనాలు నడిపే ముందుగా లైసెన్సులు పొందాలని , ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించాలని అన్నారు. యువకులు రోడ్డుపై విన్యాసాలు చేస్తూ వాహనాలు నడపటం ప్రమాదానికి దారి తీస్తుందని హెచ్చరించారు. మధ్యవర్తిత్వ కేంద్ర సభ్యుడు న్యాయవాది ఎన్ హరికృష్ణ, చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ ఇటికె నల్లప్ప,కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ సోమశేఖర్ .ప్రసంగించారు.