రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ నర్సింహులు
విశాలాంధ్ర ధర్మవరం:: రక్తదానం మహాదానమని రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి, ధర్మవరం రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్బిఐ కాలనీలోని మధు కంటి వైద్యశాలలో ప్రపంచ రక్త దాతల దినోత్సవం వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రిటైర్డ్ జిల్లా ఆర్టిఓ హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ నరసింహులు, హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు కులాలకు అతీతంగా రక్తదాన కార్యక్రమం మహా కార్యము అని తెలిపారు. ఒకరు ఇచ్చే రక్త దానం మరొకరికి ప్రాణదానం అవుతుందని తెలిపారు. రక్త దాతలు కండి, మరెన్నో ప్రాణాలను నిలబట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ప్రతి చుక్క రక్తము నేలకు వర్షము లాంటిదని, మనలోని రక్తం మరొకరికి రక్తదానం చేయడం వలన అది దైవ సేవ అవుతుందని తెలిపారు. రక్తదానానికి వెలకట్టలేనిమని, మానవతా విలువలను పెంపొందిస్తాయని తెలిపారు. మన కోసం బతుకుతే లాభం లేదు, పరుల కోసం జీవిస్తే పరమార్థం తెలిసినట్లే రక్తదానం చేయాలని తెలిపారు. మనిషిగా జన్మించినందుకు రక్తం ధారపోస్తే మరో ప్రాణం సగౌరవంగా ప్రాణాలను నిలిపే ఔషధంగా మారుతుందని తెలిపారు. సోదర భావం రక్త దానముతో ముడిపెట్టాలని, మానవత్వాన్ని చాటి మనిషిగా ఉండాలని తెలిపారు. ప్రాణం పోసే రక్త దాతలుగా అవ్వాలని మహాదాతగా సమాజంలో మంచి గుర్తింపు పొందాలని తెలిపారు. మనం ఇచ్చే రక్త దానం గర్భిణీలకు, బాలింతలకు, తల సేమియా బాధితులకు, ప్రమాదంలో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ప్రతి వ్యక్తికి ఎంతగానో రక్తం ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిని డాక్టర్ నరసింహులు తోపాటు వారి సతీమణి జయశ్రీ కూడా పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం రెడ్ క్రాస్ కార్యదర్శి శివయ్య, కోశాధికారి సత్య నిర్ధారన్ పాల్గొన్నారు.