విశాలాంధ్ర -ధర్మవరం; దివ్యాంగులకు ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎల్సీకే పురంలో గల భవిత సెంటర్లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముత్యాలమ్మ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ నాయని గారి నర్సింహారెడ్డి, కార్యదర్శి నాయిని గారి మురళీమోహన్ రెడ్డి భవిత పాఠశాలలోని దివ్యాంగులకు విద్యా సామాగ్రిని ఉచితంగా ఆర్డిఓ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ దివ్యాంగుల విద్యార్థులకు ముత్యాలమ్మ దేవాలయం కమిటీ ఇటువంటి సేవలు చేయడం నిజంగా గర్వించదగ్గ విషయమని, ఈ సేవలు దైవ సేవతో సమానమని తెలిపారు. ప్రతి మనిషి నేటి సమాజంలో పోటాపోటీగా ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నారని, అటువంటి వారు కూడా ఇటువంటి దివ్యాంగులకు ఏదో ఒక రూపేనా సహాయ కార్యక్రమాలు అందించినప్పుడే మానవతా విలువలకు గుర్తింపు ఉంటుందని తెలిపారు. అనంతరం భవిత పాఠశాల ఉపాధ్యాయులు సరస్వతి, మల్లికార్జున, ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, హరి, బాలకృష్ణ, నాగేంద్ర, మురళి, షఫీ తదితరులు పాల్గొన్నారు.