విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని ఎర్రగుంట, పుట్టపర్తి రోడ్డు, పార్థసారధి నగర్ లో గల దేవి నర్సింగ్ హోమ్ లో ఈనెల 17వ తేదీ శుక్రవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు ఉచిత సంతాన సాఫల్య అవగాహన శిబిరమును నిర్వహిస్తున్నట్లు దేవీ నర్సింగ్ హోమ్ నిర్వాహకులు డాక్టర్. పద్మ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిష్ణాతులైన డాక్టర్ లావణ్య, డాక్టర్ పద్మావతి లచే వైద్య చికిత్సలను నిర్వహించడం జరుగుతుందన్నారు. పిల్లలు పుట్టకపోవడం అనేది చికిత్స చేయదగిన మరొక వైద్య స్థితి అని తెలిపారు. గర్భం దాల్చడానికి సంవత్సరం కాలంగా ప్రయత్నించడం, విఫలం కావడం, అనేకసార్లు గర్భసరవాలు జరగడం, రిపోర్టులు మామూలుగా ఉన్నప్పటికీ గర్భం దాల్చలేకపోవడం, పి సి ఓ ఎస్ సమస్యలు, ఫాలోపియన్ ట్యూబ్ పోవడం, తదితర కారణాలు ఉంటాయని తెలిపారు. కావున సంతానం లేని వారు ఈ అవగాహన శిబిరం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అపాయింట్మెంట్ కొరకు సెల్ నెంబర్ 8105 073250, లేదా 9912031139 కు సంప్రదించాలని తెలిపారు. అదేవిధంగా డయాబెటిస్, థైరాయిడ్ వ్యాధిగ్రస్తులకు కూడా ఈనెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉచితంగా ఓపి చూడబడునని తెలిపారు. మా ప్రత్యేకతలు దీర్ఘకాలిక విష జ్వరాలు, ఊపిరితిత్తులు సమస్యలు, గుండె సమస్యలు, పక్షవాతం, నరాల సమస్యలు, మధుమేహన సమస్య, కిడ్నీ కాలేయ సమస్యలకు ప్రత్యేక వైద్యం కూడా నిర్వహించబడును తెలిపారు. వైద్యమునకు సంబంధించి ప్రభుత్వ ఉచిత సేవలు, ఆపరేషన్లు, కూడా అందిస్తామని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు.