డిపో ఆవరణలో 8వ రోజు నిరసన తెలిపిన ఉద్యోగులు…
విశాలాంధ్రIధర్మవరం; ఉద్యోగుల పై పెరిగిన పని ఒత్తిడి పని భారం ల సమస్యలపై చర్చలకు వచ్చి వాటిని పరిష్కరించిన యెడల నిరసన కార్యక్రమాలు మరింత ఉదృతం చేస్తామని ఏపీపీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు డిపో మేనేజర్ కు తెలుపుతూ… డిపో ఆవరణలో 8వ రోజు ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ…. ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరిని వీడి వెంటనే సమస్యలను పరిష్కరించే దిశగా డిపో మేనేజర్ వ్యవహరించాల ని
O. T శాతం అధికం కావడం వలన ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగి మానసికంగా ఇబ్బంది పడుతున్నారని…. 1/2019.. సర్కులర్ అమలు చేయకుండా 70,71 సర్కులర్ పేరిట ఉద్యోగులను మానసికంగా పనిష్మెంట్ల రూపంలో వేధించకూడదని యాజమాన్యం ఉద్యోగులపై పెంచిన పనిభారాలు వెంటనే తగ్గించాలని యూనియన్ నాయకులు కోరారు.ఉద్యోగుల సమస్యలపై అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్చలు నిర్వహించి ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అట్లు పరిష్కరించిన యెడల ఇప్పటివరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన ఉద్యోగులు ఈనెల 14 నుండి ఎర్ర బ్యాడ్జీలను దరిoచి నిరసన కార్యక్రమాలు మరింత ఉద్రిక్తతo చేస్తామని… యూనియన్ నాయకులు పేర్కొన్నారు.
కార్యక్రమం లో ఎంప్లాయిస్ యూనియన్ సత్యసాయి జిల్లా అధ్యక్షులు నాగార్జునరెడ్డి , డిపో కార్యదర్శి ముస్తఫా. మల్లికార్జున మూర్తి తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.