జిల్లా ఐ ఈ ఆర్ టి కోఆర్డినేటర్ ఆనందబాబు. ఎం ఈ ఓ లు.
విశాలాంధ్ర ధర్మవరం:: దివ్యాంగులను అన్ని విధాలుగా చదివించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక పాఠశాలను ఎల్సికేపురంలో ఏర్పాటు చేసిందని, అందులో వికలాంగులు గల పిల్లలను తల్లిదండ్రులు చేర్పించాలని కోఆర్డినేటర్ ఆనంద్ బాబు, ఎంఈఓ లు గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవిలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం మండలంలో ఇంటింటా సర్వే చేసి బడి ఈడు పిల్లలందరినీ కూడా గుర్తించడం జరిగిందని, ఇందులో 320 మంది దివ్యాంగులు ఉన్నారని ఇప్పటిదాకా 175 మంది విద్యార్థులను వివిధ పాఠశాలలలో నమోదు చేయించడం జరిగిందన్నారు. మిగిలిన 25 మంది విద్యార్థులు సర్వేలో గుర్తించి పాఠశాలలో చేర్పించడం జరుగుతుందన్నారు. దివ్యాంగ పిల్లలకు పాఠశాలలో ఎన్రోల్మెంట్ అయినట్లయితే వారికి ఎస్కార్ట్ అలవెన్స్ కింద సంవత్సరానికి రూ.3,000, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కింద సంవత్సరానికి రూ.3,000, బాలికలకు స్టైఫెండ్ 2000 రూపాయలు, బ్లైండ్ ఉన్నట్లయితే వారికి బ్లైండ్ లీడర్ కింద 3000 రూపాయలు సర్వ శిక్ష అభియాన్ ద్వారా ఇవ్వబడుతుందని తెలిపారు. కావున తల్లిదండ్రులు తప్పక పాఠశాలలో చేర్పించి వారి విద్యాభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఐ ఈ ఆర్ టి సరస్వతి, మల్లికార్జున పాల్గొన్నారు.