జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని జనసేన పార్టీ నూతన కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ మహాయజ్ఞ కార్యక్రమాన్ని వారి సభ్యత్వంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులకు కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ నాలుగవ విడత క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ దిగ్విజయం చేయాలని వారు పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ క్రియాశీలక సభ్యులుగా భాగస్వాములై మిగిలిన వారితో కూడా సభ్యత్వ నమోదు చేయించాలని తెలిపారు. క్రీయా శీలక వాలంటీర్స్ ఈ సభ్యత్వ కార్యక్రమంలో చురుకుగా పనిచేయాలని తెలిపారు. ఈ సభ్యత్వం చేయించుకోవడం వలన ఐదు లక్షల రూపాయల ప్రమాద జీవిత బీమా సౌకర్యంతో పాటు 50 వేల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.