స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్.. ఏపీ
విశాలాంధ్ర ధర్మవరం:: కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జీవో నెంబర్ 117 ను వెంటనే రద్దుచేసి మూడవ నాలుగవ ఐదవ తరగతి లను ప్రాథమిక పాఠశాలలో కలపాలని స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ ఏపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, జిల్లా అధ్యక్షులు అన్నం సుధాకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత పాఠశాలలో 6 నుండి 10 తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంతో పాటు సమాంతరంగా తెలుగు మాధ్యమాన్ని ఈ సంవత్సరం నుండే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. గతంలో 75 రోలు కన్నా తక్కువ ఉన్న ఉన్నత పాఠశాలలో తొలగించిన ప్రధానోపాధ్యాయ, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు తిరిగి పునరుదించాలని తెలిపారు. బోధనకు ఆటంకంగా ఉన్న బోధనేతర పనులను తగ్గించాలని, ఉన్నత పాఠశాలలో అదనపు సెక్షన్లకు ఉపాధ్యాయులను కేటాయించినప్పుడు ఆరవ ఏడవ ఎనిమిదవ తరగతులకు టిపిఆర్ నిష్పత్తిని 1:30 గాను, తొమ్మిదవ పదవ తరగతి లకు 1:40 గాను పరిగణించాలని తెలిపారు. కావున ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే విధంగా చర్యలు గైకొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.