విశాలాంధ్ర- ధర్మవరం : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని 9 వ వార్డు గుడ్డిబావి వీధికు చెందిన జనసేన పార్టీ నాయకుడు అడ్డగిరి శ్యామ్ తమ ఫ్లెక్సీలను చింపడం వల్ల వారికి పిండ ప్రధానం చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్ రాష్ట్రంలో ఘన విజయం సాధించారని, ధర్మవరంలో ఎమ్మెల్యేగా సత్య కుమార్ గెలిచిన సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డికి,ధర్మవరం టిడిపి ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ కి వీరందరికీ సంబంధించిన ఫ్లెక్సీలు వేయడంతో అది కొందరు దుండగులు సహించలేక, వాటిని చింపి వేయడంతో ఇంకోకసారి ఇటువంటి సంఘటన జరగకుండా ఉండడం కోసం ఎవరైతే ఫ్లెక్సీలు చింపి వేశారో వారికి జనసేన పార్టీ నాయకులు పురోహితునితో పిండ ప్రధానం చేయించడం జరిగింది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు,వీర మహిళ చిన్నూరు కొండా దుర్గమ్మ,ముత్యాలప్ప,కార్య నిర్వహణ కమిటీ సభ్యులు కోటికి రామంజి,కడపల సుధాకర్ రెడ్డి,భవాని శంకర్,తలారి ప్రతాప్,షఫీ హైదరాబాద్,దాసరి లక్ష్మీనారాయణ,అఖిల్ రాయల్,భగవాన్,రామ్ చరణ్,ప్రవీణ్ యాదవ్,మరియు తదితరులు పాల్గొన్నారు.