జాతీయ చేనేత మహిళ నాయకురాలు సంకారపు జయ శ్రీ
విశాలాంధ్ర ధర్మవరం:: రాష్ట్ర పేద ప్రజలకు మెరుగైన వైద్యమును రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తప్పక తమ సేవలు అందిస్తారని జాతీయ చేనేత మహిళా నాయకురాలు సంకారపు జయ శ్రీ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్ కు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కేటాయించడం పట్ల వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి క్లిష్టమైన ధర్మవరం పట్టణంలో బీసీ అభ్యర్థిగా 50 సంవత్సరాలు తర్వాత ఎన్డీఏ బిజెపి అభ్యర్థిగా ధర్మవరం నియోజకవర్గంలో సత్య కుమార్ యాదవ్ ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించడం జరిగిందన్నారు. 28 రోజుల్లో అకుంఠిత దీక్షతో రోజు 50 కిలోమీటర్లు తిరుగుతూ నియోజకవర్గ ప్రజలకు పలకరిస్తూ తమ ప్రచారాన్ని కొనసాగించారు. ఏప్రిల్ 13వ తేదీ అర్ధరాత్రి వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం పట్ల కూడా వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాము మంత్రి పదవి ఆశించడం నిజంగా గర్వించదగ్గ విషయమని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి పేదవానికి అన్ని రకాల వైద్య చికిత్సలు అందిస్తారని, ప్రభుత్వ ఆసుపత్రి పనితీరును కూడా మెరుగుపరుస్తారని వారు తెలిపారు.