విశాలాంధ్ర ధర్మవరం:: విడాకుల విషయంలో, భార్యాభర్తలు తగాదా విషయంలో భర్త రవి వర్ధన్ పై భార్య బంధువులు దాడి చేశారు. ఈ దాడిలో రవివర్ధన్ కుడికాలు ఎడమకాలకు తీవ్రమైన గాయాలు పాలయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు ధర్మారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాలకు వెళితే పట్టణంలోని శివానగర్కు చెందిన రవి వర్ధన్ అను వ్యక్తికి హిందూపురం ధనలక్ష్మి అని యువతీతో ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహమైంది. వివాహ జీవితంలో సమస్యలు రావడంతో రవివర్ధన్ ధర్మవరం కోర్టులో ఈనెల 19వ తేదీన విడాకుల కేసులు పెట్టాడు. భార్య ధనలక్ష్మి చెల్లెలు రూప శ్రీ అమ్మ లక్ష్మీదేవి వీరందరూ హిందూపురం నుంచి రవివర్ధన్ ఇంటి వద్దకు వచ్చి పెద్ద గొడవ పెట్టుకొని రవివర్ధన్ కాళ్లపై బలమైన దాడులు చేశారు. రవి వర్ధన్ ప్రైవేట్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ప్రాథమిక చికిత్సలు అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
కుటుంబ గొడవలతో సూపర్ వాజ్మాయిల్ సేవించిన సల్మాన్ ఖాన్::: పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన సల్మాన్ ఖాన్ అను వ్యక్తి తన భార్యతో వారి కుటుంబ విషయంలో ఒకరినొకరు గొడవలు పడి,గొడవ ఎంతసేపటికి సద్దు కాకపోవడంతో సల్మాన్ ఖాన్ మనస్థాపం చెంది ఇంటిలోని సూపర్ బాజిమల్లి అనే విష ద్రావకాన్ని సేవించాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటా హుటిన ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రి వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సల్మాన్ ఖాన్ సెంట్రింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.