Friday, May 3, 2024
Friday, May 3, 2024

తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న తిమ్మమ్మ మర్రిమాను సర్పంచ్

విశాలాంధ్ర, ఎన్ పి కుంట: మండల పరిధిలోని తిమ్మమ్మ మర్రిమాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ విష్ణుమూర్తి శనివారం తన అనుచరులతో కలిసి కదిరి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన వారికి కందికుంట వెంకటప్రసాద్ పసుపు కండువాలు కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న వారందరూ పార్టీ శ్రేయస్సు కోసం పనిచేయనున్నట్లు కార్యకర్తలు వివరించారు. స్థానిక సర్పంచ్ తో పాటు మరో 15 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందన్నారు. తదనంతరం తెదేపా కార్యకర్తలు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. పార్టీ అధినేత మరెన్నో జన్మదినాలు జరుపుకొని పార్టీని ముందుకు నడిపించాలని తెదేపా కార్యకర్తలు ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెదేపా మండల కన్వీనర్ చంద్రశేఖర్ నాయుడు, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ వెంకటనారాయణ, సర్పంచ్ విష్ణుమూర్తి, తెదేపా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img