విశాలాంధ్ర – ధర్మవరం : కార్గిల్ యుద్ధంలో అమరవీరులను స్మరించుకునేలా భారతీయ సైనికులు బైక్ యాత్రను ప్రారంభించారు. ఈ బైక్ యాత్ర తమిళనాడులోని ధనుష్కోటిలో ప్రారంభమై ఆదివారం ధర్మవరం మండలం రేగాటిపల్లి బైపాస్ రోడ్డుకు చేరుకుంది. ఈ సందర్భంగా బ్రీగడియర్ అజయ్ కుమార్ ఠాకూర్ మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో జరిగే నేటికీ 25 ఏళ్ల అయిందని, ఈ సందర్భంగా మనాలి, లద్ధాకు వరకు 5000 కిలోమీటర్లు మేర ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఇండియన్ ఆర్మీ సౌత్ డెల్టా ఫైర్ ఎక్స్ పిడిషన్లో కెప్టెన్ ఆదర్శ్ జ మీద టార్టెంట్ మనోజ్ నాయక్ మార్గదర్శకత్వంలో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ర్యాలీ మూడు ప్రదేశాల నుండి మూడు బృందాలుగా ఏర్పాటు చేశామని, తూర్పు బింజం నుండి దక్షిణ ధనిష్కోడి నుండి పశ్చిమ ద్వారకా నుండి మేము జూన్ 12న ప్రారంభించడం జరిగిందని తెలిపారు. జులై 9న కార్గిల్ యుద్ధ స్మారకాన్ని చేరుకుంటామని, మాకు స్పాన్సర్లుగా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారు ఇంధనము లూబ్రికెట్లను అందజేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం మేము హిమాచల్ ప్రదేశ్ అవుట్లెట్లో ఉన్నామని మేము ఎక్కడికి వెళ్లినా స్వాగతం యొక్క విధానం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. అదేవిధంగా అపోలో ఆసుపత్రి అంబులెన్స్ ఎల్లప్పుడూ మాతోనే ఉంటుందని మేము ఎక్కడికి వెళ్లినా మేము యుద్ధములో తమ భర్తలను కోల్పోయిన వీరనారీలను సత్కరిస్తున్నామని తెలిపారు. తాము చేపట్టే ఈ ర్యాలీ 5000 కిలోమీటర్లు ఉంటుందని ఒక 30 రోజుల లోపల ర్యాలీ ముగుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైనికులు పాల్గొన్నారు.