బహుజన సమాజ్ పార్టీ ధర్మవరం ఇంచార్జ్ సాకే వినయ్ కుమార్
విశాలాంధ్ర -ధర్మవరం : నంద్యాల జిల్లా పగిడాల మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన 8 ఏళ్ల వాసంతి అనే చిన్నారి పార్కులో ఆడుకొనుచుండగా అదే గ్రామానికి చెందిన ముగ్గురు మైనర్ వ్యక్తులు మాయమాటలు చెప్పి పాపను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి, తదుపరి చంపేసి కాలువలో పడేయడం జరిగిందని, ఈ హత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని బహుజన సమాజ్ పార్టీ ధర్మవరం ఇంచార్జ్ సాకే వినయ్ కుమార్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ హత్యాచారం జరిగిన సంఘటన చాలా బాధాకరం అమానుషమని, తక్షణమే ప్రభుత్వము స్పందించి హత్య చేసినవారిని కఠినంగా శిక్షించాలని తాము డిమాండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. లేనిపక్షంలో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలవాలని ఇదే సంఘటన అగ్రకులాల్లో జరిగింటే హుటా హుటిన అన్ని చర్యలు చేపట్టి వారు అని తెలిపారు. బీసీ కులం కాబట్టే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు దుయ్యబట్టారు. మున్ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు గైకొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.