టూ టౌన్ పోలీసులు కేసు నమోదు.
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో బాడుగకు ఉంటున్న సచివాలయ మహిళా పోలీస్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ దొంగతనములో 85000 క్యాష్, ఎనిమిది నరా తులాల బంగారమును దొంగలు దోచుకెళ్ళారు. వివరాలు ఇలా ఉన్నాయి… జర్నలిస్టు కాలనీలో లావణ్య అనే దర్శనమలలో మహిళా పోలీస్ గా విధులు కొనసాగిస్తున్న లావణ్య ఇంట్లో దొంగతనం చోటుచేసుకుంది. భర్త చంద్రశేఖర్ డిఎస్సీ కోచింగ్ లో ఉంటూ, భార్యతో పాటు ఇంట్లోనే ఉండేవాడు. ఈనెల 10వ తేదీ బంధువుల ఇంటికి అనంతపురానికి సాయంత్రం వెళ్లారు. తదుపరి 13వ తేదీ ఆదివారం రాత్రి 7:30 గంటల సమయంలో తిరిగి ధర్మవరంలోని జర్నలిస్టు కాలనీకి వచ్చారు. గేటు తలుపులు తీసి ఉండడంతో, లోపలికి వెళ్లి చూడగా దొంగతనం జరిగినట్లు వారు తెలుసుకున్నారు. రెండు బీరువాలను పగలగొట్టి అందులో నుండి రూ.85,000 నగదు తో పాటు ఎనీమిది నరా తులాల బంగారము కూడా దోచుకుని వెళ్లినట్లు బాధితులు తెలిపారు. మామూలుగా లావణ్య తల్లి ఇంట్లో అప్పుడప్పుడు పడుకునేవారు (ఇదే జర్నలిస్ట్ కాలనీలో) మెయిన్ చిన్న గేటును తీసి, ఇంటి లోపలకు వెళ్లే వాకిలిని పూర్తిగా ఓ రాడుతో పగలగొట్టి, నగదు బంగారం దోచుకెళ్ళారు. కేవలం రెండు రోజుల లోపే ఈ దొంగతనం జరిగింది. తదుపరి మహిళా పోలీస్ లావణ్య భర్త చంద్రశేఖర్ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిఐ ఆదేశాల మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, దొంగతనం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు, అటు తర్వాత పగిలిన బీరువాలు, రేకులు తదితర వాటిని పరిశీలించారు. క్లూస్ టీం సోమవారము వస్తుందని పోలీసులు తెలిపారు. తదుపరి టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.