విశాలాంధ్ర -ధర్మవరం: అంతర్జాతీయ క్రీడా పోటీలలో యశోద పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరచడం జరిగిందని డైరెక్టర్ పృథ్వీరాజ్, ప్రిన్సిపాల్ అనూప్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ జూలై నెలలో జరిగిన అంతర్జాతీయ టార్గెట్ బాల్ పోటీలలో పాల్గొని ఇండియా టీంకు ప్రాతినిధ్యం వహించి రెండవ స్థానం కైవసం చేసుకున్నారని తెలిపారు. అంతర్జాతీయ క్రీడా పోటీలలో డి. తమ్మయి, శ్రీ చరణ్… పదవ తరగతి, ఏ. యశ్వంత్ కుమార్ పదవ తరగతి విద్యార్థులు జులై నెలలో 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు నేపాల్ లో జరిగిన పోటీలలో ప్రతిభ కనబరచడం జరిగిందని తెలిపారు. అనంతరం ఆ విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ప్రిన్సిపాల్ తో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు, పాఠశాల ఉపాధ్యాయులు, బోధ నేతల బృందం తోటి విద్యార్థులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.