Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మెరుగైన వైద్యసేవలుఅందజేస్తా

కొత్త వైద్యులు ఉషారాణి

విశాలాంధ్ర, సీతానగరం: రోగులకు మెరుగైన వైద్యసేవలు అందజేస్తానని వైద్యులు పి. ఉషారాణి తెలిపారు. స్థానిక పి హెచ్ సిలో రెండో మెడికల్ ఆఫీసర్ గా ఆమె శుక్రవారం జాయిన్ అయ్యారు.ఇంతవరకు ఇక్కడ రెండో మెడికల్ ఆఫీసరుగా పనిచేసిన డాక్టరు నీలిమ ప్రసూజకు ఉన్నతవిద్య సీటు రావడంతో ఆమె గురువారంనాడు రిలీవ్ అయ్యారు. వెంటనే ప్రభుత్వం కూడా కొత్తగా వైద్యులను నియమించడంతో ఉషారాణి ఇక్కడ జాయిన్ అయ్యారు. ఆమెమాట్లాడుతూ స్థానిక ప్రాధమిక అరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శిరీష, వైద్యసిబ్బంది, మండల ప్రజాప్రతినిదులు,అధికారులు సహాకారంతో తనవంతు సేవలు అందించేందుకు కృషిచేస్తానని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో రోగులకు సేవలు అందించేందుకు ఎల్లపుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. ఉద్యోగంలో కొత్తగా జాయిన్ అయిన తాను అందరిసహకారంతో సేవలు అందిస్తూ, కుటుంబ వైద్య విధానం ద్వారా కూడా ఇంటింటికీ వెళ్లి సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img