Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

కొత్తవలస, జోగమ్మపేటలలో స్వచ్చతే సేవా కార్యక్రమాలు

విశాలాంధ్ర, సీతానగరం: గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా అంతా కలిసి తీర్చిదిద్దేందుకు కృషిచేద్దామని కొత్తవలస, జోగమ్మపేట పంచాయతీ సర్పంచులు రెడ్డి అనితఅప్పలనాయుడు, కొట్యాడ సింహాచలంలు తెలిపారు.శనివారం ఆయా గ్రామాల్లో స్వచ్ఛతేసేవా కార్యక్రమం లోభాగంగా అందరితో కలిసిర్యాలీలు నిర్వహించారు.పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించామని గ్రామ పంచాయతీసెక్రటరీలు గౌతమి, కిరణ్ కుమార్ లు తెలిపారు.ఇదిలాఉండగా స్వచ్ఛతే సేవా కార్యక్రమాలను  సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 2 వరకు పంచాయతీపరిధిలోని అన్నిగ్రామాలలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు
ఈఓపిఆర్డీ వర్మ చెప్పారు.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిత్యం పరిశుభ్రత పాటించాలని, బహిరంగ మలమూత్ర విసర్జన చేయకూడదని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.  

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img