Friday, April 26, 2024
Friday, April 26, 2024

నీటి ట్యాంకులతో త్రాగునీరు పంపిణీ

అనంతపురం జిల్లా, విశాలాంధ్ర-తాడిపత్రి: నీటి ట్యాంకులతో త్రాగునీరు పంపిణీ చేసినట్లు వైఎస్ఆర్సిపి నాయకులు రియాజ్, ప్రసాదు తెలిపారు. గురువారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ఐదు రోజుల నుండి త్రాగునీరు రాక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకొని వాటి పరిష్కారం మార్గంగా ముస్లిం మైనారిటీ వైఎస్ఆర్ సీపీ నాయకుడు ఫయాజ్ భాషా ఆధ్వర్యంలో నీటి ట్యాంకుల ద్వారా ప్రజల దాహార్తిని తీర్చామని తెలిపారు. ఈ సందర్భంగా ఆ కాలనీ ప్రజలు మాట్లాడితూ త్రాగునీరు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మా దాహార్తిని తీర్చిన ఫయాజ్ భాష కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img