విశాలాంధ్ర,సీతానగరం: మండలకేంద్రంలో మంగళవారం సాయంత్రంజరిగిన ఘటనపై పార్వతీపురం డిఎస్పీ సుభాష్ బుదవారం ఉదయంనుంచి చాలాసమయం సీతానగరంలో విచారణజరిపి సంఘటన జరిగిన తీరును తెలుసుకున్నారు. స్తానిక బజారులోను, వెలుగు కార్యాలయంలో ఆయన పలువురిని విచారించారు.
పెదభోగిలికి చెందిన హరియాల నాగేంద్రను కోటసీతారాంపురం గ్రామానికి చెందిన దివ్వెల కేశవ రాడ్ తో
సీతానగరంలో దాడిచేసి గాయపర్చడంతో హత్యాయత్నం కేసునమోదు చేసినట్లు సీతానగరం ఎస్ ఐ నీలకంఠం చెప్పారు. ఈకేసును డి ఎస్పీ విచారణ చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం గాయపడిన సురేంద్ర పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
![](https://visalaandhra.com/wp-content/uploads/2022/11/image-17.png)