Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఎమ్మెల్యేను కలిసిన ఎన్ సి ఎస్ చక్కెర కర్మాగార ఫీల్డ్ సిబ్బంది

విశాలాంధ్ర,సీతానగరం:మండలంలోని లచ్చయ్యపేట ఎన్ సి ఎస్ చక్కెర కర్మాగారంలో పనిచేస్తున్న25మంది ఫీల్డ్ సిబ్బందిని యాజమాన్యం అకస్మాత్తుగా ఆపివేయడంతో వారంతా బుదవారం ఉదయం పార్వతీపురంవెళ్లి ఎమ్మెల్యే అలజింగి జోగారావును కలసి తమ గోడును వినిపించారు. గతరెండేళ్లుగా ఎన్ సి ఎస్ చక్కెర కర్మాగారంలో గానుగ నిలిపివేసినప్పటికి కొంతమంది ఉద్యోగులకు,కార్మికులకు, ఫీల్డ్ సిబ్బందికు వేతనాలను యాజమాన్యం చెల్లిస్తుంది. ఇటీవల కొన్నినెలలుగా ఎన్ ఎస్ టి ఎల్ వీరికి వేతనాలు చెల్లించడం జరుగుతుంది.అర్ధాంతరంగా 25మందిని యాజమాన్యం నిలిపివేయగా వారిసమస్యను ఎన్ సి ఎస్ మేనేజింగు డైరెక్టర్ నారాయణం నాగేశ్వరరావుకు ఫోన్లో ఎమ్మెల్యే వివరించి వారిని కొనసాగించాలని కోరారు. దీనికి ఎండి నాగేశ్వరరావు సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే జోగారావు తెలిపారు. వారంతా ఎమ్మెల్యే జోగారావుకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img