విశాలాంధ్ర, సీతానగరం: మండలంలోని రంగమ్మపేట, పనుకుపేట గ్రామ పంచాయతీల్లో గురువారం ఉపాధిహామీ పథకం గ్రామసభలను సర్పంచుల అధ్యక్షతన నిర్వహించారు.2022- 23 సంవత్సరంలో చేపట్టనున్న పనులు, వేతనదారులు చేయాల్సినపనులు, ప్రణాళికలను, ప్రతిపాదనలుచేసి ఆమోదం తీసుకోవడం జరుగుతుందని సహాయ ప్రోగ్రాంఅధికారి నాగలక్ష్మి చెప్పారు. ఈకార్యక్రమంలో సర్పంచులు భాస్కరరావు, బంకురుపద్మావతి శ్రీహరి నాయుడు, సెక్రెటరీలు కామేశ్వరరావు, ఎస్ సంతోష్ కుమార్, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, ఉపాధిహామీపథకం ఎఫ్ఏ లు, వేతనదారులు పాల్గొన్నారు