జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు వాకాడ
విశాలాంధ్ర, సీతానగరం: రైతుల డాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వ మద్దతు ధరకే కోనుగోలు చేస్తామని జిల్లా వ్యవసాయ సలహామండలి చైర్మన్ వాకడ నాగేశ్వర రావు, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పోల ఈశ్వర నారాయణలు తెలిపారు.శుక్రవారం మండల వ్యవసాయ సలహామండలి ఛైర్మన్ పోల ఈశ్వరనారాయణ అధ్యక్షతన నిర్వహించారు.ఈసమావేశంలో రైతు భరోసా కేంద్రములు ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా వ్యవహరింపబడతాయని,
ఇ-పంట నమోదు ప్రకారం రైతు భరోసా కేంద్రాలు మూడు కేటగిరీలుగా వర్గీకరించ బడ్డాయని చెప్పారు. ఏకేటగిరీ రైతు భరోసాకేంద్రంకి ఒక టెక్నికల్ అసిస్టెంట్, నలుగురు వాలంటీర్లు, బి మరియు సి కేటగిరీ రైతుభరోసా కేంద్రాలకు ఒక టెక్నికల్ అసిస్టెంట్, ముగ్గురు వాలంటీర్స్ నియమించడం జరిగిందన్నారు. ఇందులో వాలంటీర్లు ప్రొక్యూర్మెంట్ అసిస్టెంట్ మరియు రూట్అసిస్టెంట్ గా వ్యవహరిస్తారని, గ్రామ వ్యవసాయ సహాయకులు సూపర్వైజర్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారని తెలిపారు.నేరుగా రైతు కళ్ళాల వద్దనుండి ధాన్యం సేకరించబడుతుందని తెలిపారు .
ప్రక్రియ జరుగుతుందన్నారు.మద్దతుధర ప్రకారం క్వింటాకు 2040/- గా ధాన్యం కొనుగోలు చేస్తారని,గొనేసంచులు రైతులకు రైతు భరోసా కేంద్రం వద్ద ఇవ్వటం జరుగుతుందన్నారు.ఒకవేళ రైతులే సొంతంగా గోనేసంచులు కొనుగోలు చేసినచో వారికి ధాన్యండబ్బులతో పాటు ఈడబ్బులుకూడా జమఅవుతాయని తెలియచేశారు.ఈకార్యక్రమంలో మండల అధ్యక్షులు బలగ శ్రీరాములునాయుడు, జడ్పీటిసి బాబ్జి, మండల వ్యవసాయధికారి అవినాష్,మండల పశువైద్య అధికారి డాక్టరు రామారావు, సివిల్ సప్లైస్ టెక్నికల్ అసిస్టెంట్, ఎంపీటీసీలు, సర్పంచులు, మండలి బోర్డ్ సభ్యులు,సీహెచ్సీ గ్రూప్ సభ్యులు, రైతులు, వ్యవసాయ సహాయకులు తదితరులు పాల్గొన్నారు.