Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

నిడగల్లు ఉన్నతపాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన డిఈఓ

విశాలాంధ్ర,సీతానగరం: పార్వతీపురం మన్యం జిల్లావిద్యాశాఖాధికారి డాక్టరు రమణ శుక్రవారంనాడు నిడగల్లు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలను ఆకస్మిక సందర్శన చేశారు. పాఠశాలలో మద్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి దగ్గరుండి విద్యార్థినీ ,విద్యార్థులకు వడ్డించారు.ఆయన కూడా రుచిచూశారు.నిర్వహణపై పూర్తిసంతృప్తి వ్యక్తంచేశారు.పాఠశాల పరిసరాలను ,రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు .నాడు-నేడు ఫేస్ 2 పనులను కూడా పరిశీలించారు. ఈకార్యక్రమంలో పాఠశాల హెచ్ ఎం, జిల్లా ఏపిటిఎఫ్ అధ్యక్షులు ఎం.శివున్నాయుడు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img