విశాలాంధ్ర, సీతానగరం:మండలంలోని పెదబోగీలి గ్రామపంచాయతీలోని అప్పయ్యపేట గ్రామంలో బుధవారంనాడు జగనన్న శాశ్వత భూహక్కు పథకంలో భాగంగా డ్రోన్లుతో భూసర్వేను నిర్వహించారు. డ్రోన్లు ఎగురవేసి భూమిని, హద్దులను పరిశీలించారు. గ్రామాల్లో భూసమస్యల పరిష్కారంకోసం ఈసర్వే ఎంతగానో ఉపయోగపడుతుందని తహశీల్దార్ ఎన్వీ రమణ చెప్పారు.ఈకార్యక్రమంలో సర్పంచ్ జొన్నాడ తెరేజమ్మ, ఎంపిటిసిలు బురిడి సూర్యనారాయణ, కిరణ్, ఈఓ వెంకట రావు,కార్యదర్శి సుధారాణి, విఆర్ఓలు కుమార్,సింహాచలం, గ్రామపెద్దలు, రెవెన్యూ, సర్వే అధికారులు, సచివాలయసిబ్బంది పెద్దఎత్తున పాల్గొన్నారు.