Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పాముకాటుకు వ్యక్తి మృతి

విశాలాంధ్ర – బెలగాం : పాముకాటుకు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రి ఔట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయ గరుగుబిల్లి మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన కమటాన చిరంజీవి (36) పొలంలో గుండ జల్లుతుండగా గుర్తుతెలియని విషపు పాము కాటు వేసింది. పామును చేతితో లాగి విసిరివేసి ఇంటికి నడుచుకుంటూ వచ్చి విషయాన్ని కుటుంబీకులకు తెలియపరిచాడు. వెంటనే వారు అప్రమత్తమై 108 ద్వారా పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్ష చేసి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఔట్ పోస్టు పోలీసులు వివరాలు నమోదు చేసినట్లు గరుగుబిల్లి స్టేషన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతునికి మూగదైన భార్య సునీత, కళ్ళు కనపడని తండ్రి పోలినాయుడు, వృద్ధురాలైన తల్లి వున్నారు. మేనల్లుడు మధుని పెంచుకుంటున్నారు. ఇంటి పెద్దదిక్కు ఇలా కోల్పోవడంతో ఆకుటుంబ దుఃఖాన్ని ఎవరూ అపలేకపోయారు. ఊరంతా కన్నీరు మున్నీరయ్యారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img