విశాలాంధ్ర – సంతబొమ్మాళి : రాష్ట్ర తెదేపా అధ్యక్షులు,టెక్కలి శాసనసభ్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో శుకరవారం సంతబొమ్మాళి మండలం నర్సాపురం పంచాయతీ కి చెందిన పలువురు వైకాపా నాయకులు తెలుగు దేశం పార్టీలో చేరారు. ఆ పంచాయితీ ఆనందపురం(యర్నాగులపేట) గ్రామానికి చెందిన దాసరి కిశోర్ (వైస్ సర్పంచ్ ), ఎర్నాగుల అప్పారావు, ఎర్నాగుల రామారావు, ఎర్నాగుల నాగేశ్వరరావు, ఎర్నాగుల చెంగళరావు, ఎర్నాగుల రామచంద్రరావు, ఎర్నాగుల గోపి, ఎర్నాగుల ఆనందరావు, ఎర్నాగులమన్మధరావు, ఎర్నాగుల వాసుదేవరావు, ఎర్నాగుల అనిల్,ఎర్నాగుల అజయ్ కుమార్, ఎర్నాగుల గణేష్, శిద్దా మోహనరావు, శిద్దా తులసీరావు,దాసరి రఘుపతిరావు, నల్లనాగుల ప్రసాదు, శిద్దా జగన్నాధం, సవ్వాన జగన్నాధంలతో పాటు 30 మంది పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే చరణదాసుపురం గ్రామం నుండి కటారి నరసింహులు, సదునపల్లి వెంకటరావు, చెన్నంశెట్టి రామన్న, చెన్నంశెట్టి రమేష్, చెన్నంశెట్టి రాములు, మొగలి రాములు, మొగలి అప్పారావు, తంగిళ్ల అప్పన్న, సదునపల్లి అప్పన్న,సదునపల్లి వీరాసామి, సదునపల్లి సాయి, చనిబోని మల్లేష్, సదునపల్లి మల్లేష్, గాది మల్లేష్ లతో పాటు 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ అచెన్నాయుడు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వారితో పాటు సంతబొమ్మాళి మండలం తెలుగుదేశం కోషాధి కారి శవ్వాన ప్రసాదరావు, నర్సాపురం ఎంపిటీసి మోడి రామచంద్రరావు, పంచాయతీ తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు