ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో క్రమంగా ప్రవాహం పెరుగుతున్నది. దీంతో నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద ఉగ్రరూపం దాల్చింది. నిన్న తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. దీంతో గోదావరిలోకి భారీగా వరద ప్రవహం కొనసాగుతోంది. కందకుర్తి వద్ద పురాతన శివాలయం పూర్తిగా నీటమునిగింది.