విశాలాంధ్ర`హైదరాబాద్ : పెట్రోల్, డిజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఈ నెల 5న ట్యాంక్బండ్పై నిరసన తెలిపిన వారిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని సోమవారం ఎన్ఎఫ్ఐడబ్ల్యూ నాయ కులు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ట్యాంక్బండ్లో నిరసన తెలియజేసేందుకు గ్యాస్ బండ విరడంపై ఈ కేసులు బనాయించడం దారుణమన్నారు. 5న నిరసన కార్యక్రమం జరిగితే 7న కేసు నమోదు కావడంలో ఆంతర్యం ఏమిటిని వారు ప్రశ్నించారు. క్రైం నెం.216/2021 341,277,278,290, 341 క్రింద ఎన్.జ్యోతి, కృష్ణకుమారి, జె.లక్ష్మిపై కేసులు నమోదు కావడం దారుణమన్నారు. ఈ కేసులను వెంటనే ఎత్తివేయాలని వారు హోంమంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎన్ఎఫ్ఐడబ్ల్యూ నాయకులు పాల్గొన్నారు.