సింగిల్ స్క్రీన్ థియేటర్ లలో పార్కింగ్ చార్జి వసూలు చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయడంపై శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిశారు. తమ సమస్యలకు పరిష్కారం చూపినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసి సత్కరించారు. గతంలో ‘సేవ్ సినిమా సేవ్ థియేటర్’ నినాదంతో పార్కింగ్ ఫీజు వసూలు, నామమాత్రపు విద్యుత్తు బిల్లులు ప్రాపర్టీ ట్యాక్స్, జీఎస్టీ తదితర విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.