ప్రధాని మోదీకి భయపడే పరిస్థితిలో తెలంగాణ లేదని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాల దయాదాక్షిణ్యం పైనే కేంద్ర ప్రభుత్వం బతుకుతోందని అన్నారు. అన్ని వర్గాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం మేలు చేస్తోందన్నారు. ఒక్క హైదరాబాద్లోనే కాకుండా దేశంలో కూడా బీజేపీ గల్లంతయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. పారిశ్రామికవేత్తల కోసం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారా అని మండిపడ్డారు.