తల్లులను క్షోభ పెట్టారు.. సీఎం హిమంత బిశ్వ శర్మ నాలుక కోయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఓ మూర్ఖుడు అని రాహుల్, సోనియా ఆయనకు తెల్వదా? అని మండిపడ్డారు. రాహుల్ తండ్రి ఎవరని సంస్కారహీనంగా మాట్లాడతారా? అని ప్రశ్నించారు.ప్రధాని మోదీకి సంస్కారం ఉంటే వెంటనే హిమంత బిశ్వ శర్మను పదవి నుంచి తొలగించాలని అన్నారు.తాము పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయలేదని తెలిపారు. తెలంగాణలో కూడా ప్రజాస్వామ్యం లేదు. ఉద్యోగాలడిగితే రేవంత్ రెడ్డిని అరెస్టు చేస్తారా?’’ మండిపడ్డారు.