తెలంగాణకు గర్వకారణంగా ఉన్న సింగరేణి సంస్థ మూసివేతకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. సింగరేణి బొగ్గు గని కార్మికులు వారి స్వేదంతో దక్షిణ భారతానికి వెలుగులు పంచుతున్నారని చెప్పారు. సింగరేణిలో రాష్ట్రానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటా ఉందని అన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను తప్పుడు రీతిలో ఉపయోగిస్తోందని అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేంద్రానికి కేసీఆర్ ఎన్నోసార్లు విన్నవించారని అయితే కేంద్రం నిరంకుశంగా ముందుకు సాగుతోందని అన్నారు.