Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

ఏషియన్‌ ఫిల్మ్స్‌ నారాయణ్‌ దాస్‌ ఇకలేరు

ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌, నిర్మాత, ఫిల్మ్‌ ఛాంబర్‌ అధినేత నయరన్‌ దాస్‌ నారంగ్‌ ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్‌, సావిత్రి కాలం నుంచి నారాయణ్‌ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. మహేష్‌ బాబు, విజయ్‌ దేవరకొండ, సురేష్‌ బాబు వంటి పలువురు సినీ నటుల సహకారంతో తెలంగాణలో అనేక థియేటర్లను నిర్మించారు. అనేక చిత్రాలను డిస్ట్రిబ్యూషన్‌ చేశారు. ఏషియల్‌ మల్టీప్లెక్స్‌లను స్ధాపించారు. మహేశ్‌ బాబుతో ఏఎంబీ మల్టీప్లెక్స్‌ను నిర్మించారు. గతంలో లవ్‌ స్టోరీ, లక్ష్యం వంటి చిత్రాలను నిర్మించిన ఆయన ప్రస్తుతం నాగార్జున , శేఖర్‌ కమ్ములతో సినిమాలను నిర్మిస్తున్నారు. ఆయన మృతి పరిశ్రమకు తీరని లోటని పలువురు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img