Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

20 మంది ప్రజాప్రతినిధులతో చికోటికి లింక్‌..

చికోటి వ్యవహారంలో తీగ కదిలేస్తే డొంకే కదులుతున్నట్టుగా ఉంది. ప్రజాప్రతినిధుల లింక్‌ చిట్టా తాజాగా వెలుగు చూసింది.చికోటి వాట్సాప్‌ చాట్‌ సంచలనం రేపుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 20 మంది ప్రజాప్రతినిధులతో చికోటికి లింక్‌ ఉన్నట్టు తెలుస్తోంది. చికోటి నిర్వహించిన క్యాసినోకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లినట్టు సమాచారం. చికోటి వాట్సాప్‌ చాట్‌ను ఈడీ రికవరీ చేసింది.చికోటి వాట్సాప్‌తో ప్రజాప్రతినిధులతో చాటింగ్‌ నిర్వహించినట్టు తేలింది. చికోటికి టచ్‌లో ఉన్న 12 మంది ప్రజాప్రతినిధులకు ఈడీ నోటీసులు అందజేయనున్నట్టు సమాచారం. 20 మందికిపైగా వీఐపీలకు కూడా నోటీసులు అందజేయనున్నట్టు సమాచారం. సోమవారం నుంచి చిట్టాలో ఉన్న వారిని విచారించే అవకాశం ఉంది. హైదరాబాద్‌ శివారులో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఉమ్మడి నిజామాబాద్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. హైదరాబాద్‌లో కీలకపాత్ర పోషిస్తున్న ప్రజాప్రతినిధి సోదరుడు.. హైదరాబాద్‌లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఓ ప్రజాప్రతినిధి, మెదక్‌ జిల్లాకు చెందిన డీసీసీబీ చైర్మన్‌తో పాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు చికోటితో లింక్‌ ఉన్నట్టుగా సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img