తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు
హైదరాబాదులో కేఆర్ఎంబీ సమావేశం
ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నేడు హైదరాబాదులో సమావేశమైంది. 66:34 నిష్పత్తిలో జలాల పంపిణీని తెలంగాణ గట్టిగా తిరస్కరించింది. రెండు రాష్ట్రాలకు సమానంగా నీటి వాటాలు ఇవ్వాలని పట్టుబట్టింది. 66:34 నిష్పత్తిలో జలాల పంపిణీలో తాము భాగస్వామ్యం కాబోమని స్పష్టం చేసింది. విభజన చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కేఆర్ఎంబీని కోరారు. ఇదే విషయమై రజత్ కుమార్ ఇటీవల కేఆర్ఎంబీ చైర్మన్కు లేఖ కూడా రాశారు.