తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్లో విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు మొత్తం 5.05లక్షల మంది హాజరు కాగా, ఉత్తీర్ణత 91.31 శాతంగా నమోదైంది. ఇక తాజాగా విడుదలైన ఫలితాల్లో బాలికలు సత్తాచాటారు. 93.23 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. బాలురు ఉత్తీర్ణత 89.42 శాతం. 99.05 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా టాప్లో ఉంటే.. 65.10 శాతం ఉత్తీర్ణత సాధించిన వికారాబాద్ చివరి స్థానంలో నిలిచింది.