మాజీ ముఖ్యమంత్రికి రేవంత్ నివాళి
వైఎస్సార్ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గాంధీ భవన్ లో నేడు జరిగిన వైఎస్సార్ జయంతి వేడుకలలో ఆయన పాల్గొన్నారు.. ఇక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ, వైఎస్సార్ ముద్ర ప్రజల గుండెల్లో భద్రంగా ఉందన్నారు. సంక్షేమం అంటే వైఎస్సార్ గుర్తుకొస్తారని చెప్పారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు వైఎస్సార్ సంక్షేమమే స్ఫూర్తి అని అన్నారు. వైఎస్సార్ భౌతికంగా ప్రజల మధ్య లేకున్నా ఆయన స్ఫూర్తి బతికే ఉంటుందన్నారు. వైఎస్ అకాల మరణం కాంగ్రెస్ కు తీరని లోటన్నారు. వైఎస్సార్ నిజమైన వారసులు కాంగ్రెస్ లో కి రావాలని సూచించారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తాని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి వైఎస్సార్ ఎంతో కృషి చేశారని చెప్పారు. రాహుల్ జోడో యాత్రకు వైఎస్సార్ పాదయాత్ర స్ఫూర్తి అని వెల్లడించారు.
- .