17 ఎస్టీపీలు నిర్మించబోతున్నాం : మంత్రి కేటీఆర్
హైదరాబాద్లో మురుగునీటి శుద్దిపై తెలంగాణ సర్కార్ దృష్టి పెట్టింది. హైదరాబాద్లోని ఫతేనగర్లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. దీంతో పాటు రూ. 1280 కోట్లతో 17 ఎస్టీపీలు నిర్మించబోతున్నట్లు చెప్పారు. మంత్రి కేటీఆర్ శుక్రవారం కూకట్ పల్లి నియోజకవర్గంలో పర్యటించారు.మురికినీటిని శుద్ధి చేయడం అత్యంత ప్రాధాన్యం కలిగిన పని అని కేటీఆర్ పేర్కొన్నారు. ాదేశంలో 8 మహానగరాలు ఉన్నాయి. వీటన్నింటిలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లో దాదాపు 40 శాతం(772 ఎంఎల్డీల) మురికి నీటిని ఎస్టీపీల ద్వారా శుద్ధి చేస్తున్నాం. అయినా ఇంకా 1200 ఎంఎల్డీల దాకా మురికి నీరు మిగిలి ఉంటుందని ్ణ అన్నారు. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి సర్కిల్స్లో రూ.1,280 కోట్లతో 17 ఎస్టీపీలు నిర్మించబోతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పట్టణీకరణకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు.