ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి చెప్పేదానికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పేదానికి పొంతన లేదని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. కరీంనగర్లో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్తో కలిసి మంత్రి గంగుల మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రైతులను అనేక ఇబ్బందులు పెడుతున్నదని అన్నారు. తెలంగాణ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్రప్రభుత్వం నిరాకరిస్తున్నందుకుగాను కరీంనగర్ కలెక్టరేట్తోపాటు జిల్లాలోని కార్యాలయాల దగ్గర ధర్నా చేస్తామన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు ధర్నా కొనసాగుతుందని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం పంటలను కొనే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. వంద కిలోల ధాన్యానికి 67 కిలోల బియ్యం ఇవ్వాలని ఎఫ్సీఐ నిబంధన పెట్టిందని, కేంద్రం రైతుల మీద లాభాన్ని చూడొద్దన్నారు. యాసంగిలో ధాన్యం నూక ఎక్కువ వస్తుందని, గిట్టుబాటు కాదని వెల్లడిరచారు. తాను, మంత్రి కేటీఆర్ ధాన్యం కొనాలని కేంద్ర మంత్రిని అడిగితే నిరాకరించారని తెలిపారు. బండి సంజయ్ వరి వెయ్యాలని చెప్తున్నాడని, కేంద్ర ప్రభుత్వం తాము కొనేది లేదని చెప్తున్నదని విమర్శించారు.